దీపావళితో కాలుష్యమైన భారత రాజధాని…! దీపావళి వేళ దేశ రాజధానిని కాలుష్యం కమ్మేసింది. సుప్రీంకోర్టు తీర్పును పక్కనబెట్టి రాత్రంతా టపాసులు పేల్చడంతో ఢిల్లీలో వాతవరణం ప్రమాదకర స్థాయికి పడిపోయింది. చాలా ప్రాంతాల్లో కాలుష్య స్థాయి తీవ్రంగా ఉంది. గురువారం ఉదయం కూడా ఢిల్లీ వీధుల్లో కాలుష్యపు పొగ దట్టంగా కమ్ముకుంది. ఆనంద్ విహార్ ప్రాంతంలో గాలి నాణ్యతా సూచీ(ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) 999కి పడిపోయింది. మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియం వద్ద కూడా 999గా నమోదైంది. కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో ఈ ...
Read More »తాజా వార్తలు
మొదలైన ఎస్సై పోస్టుల దరఖాస్తు ప్రక్రియ(APSLPRB Recruitment 2018)
మొదలైన ఎస్సై పోస్టుల దరఖాస్తు ప్రక్రియ, ఆంధ్రప్రదేశ్లో 3,137 పోలీసు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గతవారం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. అయితే వీటిలో 334 ఎస్సై పోస్టుల భర్తీకి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఇందులో భాగంగా సోమవారం (నవంబరు 5) సాయంత్రం ఎస్సై పోస్టుల దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా నవంబరు 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష (ప్రిలిమ్స్, మెయిన్స్), దేహదారుఢ్య పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నవంబరు 24 ...
Read More »హైదరాబాదులో పాతబస్తీ గోదాంలో అగ్ని ప్రమాదం
హైదరాబాదులో పాతబస్తీ గోదాంలో అగ్ని ప్రమాదం. హైదరాబాద్ నగరంలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పాతబస్తీ ప్రాంతంలో ఇంజన్బౌలిలోని చెప్పుల గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా పెద్ద ఎత్తులో మంటలు ఎగసి పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రబ్బరు ఉత్పత్తులు మంటలలో కాలడంతో మంటల నుంచి దట్టమైన పొగ ప్రాంతాన్ని కమ్మేసిందని స్థానికులు చెబుతున్నారు. ఇక అక్కడి గోదాంలో అగ్నిప్రమాదం జరిగిందని సమాచారం అందుకున్న సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం సంభవించి ఉండొచ్చునని ...
Read More »క్రైస్తవుల బస్సుపై ఉగ్రవాదుల కాల్పులు…!
క్రైస్తవుల బస్సుపై ఉగ్రవాదుల కాల్పులు…! ఈజిప్టు రాజధాని కైరోలో ఓ ముష్కరులు కాల్పులకు తెగబడి ఎనిమిది మందిని పొట్టన బెట్టుకున్నాడు. శుక్రవారం క్రైస్తవుల బృందం ప్రయాణిస్తోన్నఓ బస్సుపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, మరో 14 మంది గాయపడ్డారు. కైరోలోని మినియా ప్రాంతంలోని ప్రార్థనామందిరానికి వెళ్లి తిరిగొస్తుండగా ముష్కరులు కాల్పులకు తెగించారు. మృతుల్లో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. ఈ దాడికి పాల్పడింది మేమెనంటూ ఐఎస్ ఉగ్రవాదులు ప్రకటించారు. ఉత్తర సెనాయ్ దాడి తర్వాత ఈ ఏడాది తామే దాడులకు పాల్పడినట్టు ...
Read More »ఇండియన్ ఆర్మీలో ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉద్యోగాలు
ఇండియన్ ఆర్మీలో ఇంజినీరింగ్ విద్యార్థులకు ఆర్మీలోఉద్యోగాలు ఇండియన్ ఆర్మీ 2019 జులైలో ప్రారంభమయ్యే 129వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (టీజీసీ-129)లో ప్రవేశాలకు అవివాహితులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులకు డెహ్రాడూన్లోని ఇండియన్ మిలటరీ అకాడమీలో ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ తర్వాత అనంతరం లెప్టినెంట్ హోదాతో ఉద్యోగావకాశం కల్పిస్తారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి నవంబరు 28 వరకు గడువు ఉంది. బ్రాంచ్ ఖాళీలు సివిల్ 10 ఆర్కిటెక్చర్ 01 మెకానికల్ 04 ఎలక్ట్రికల్/ ...
Read More »ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల…!
ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల…! ఏపీలో నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న ఉపాధ్యాయ నియామక పరీక్ష(డీఎస్సీ) షెడ్యూల్ను గురువారం మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. విజయవాడలోని ఓ హోటల్లో ఉదయం 9 గంటలకు షెడ్యూల్ను ప్రకటించిన మంత్రి, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ శుక్రవారం విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ఈ సారి టెట్ కమ్ టీఆర్టీని నిర్వహిస్తామని ప్రకటించారు. అక్టోబరు 26న నోటిఫికేషన్ విడుదల చేసి, నవంబరు1 నుంచి దరఖాస్తులను స్వీకరణ మొదలవుతుందని చెప్పారు. డిసెంబరు 6 నుంచి పరీక్షలను నిర్వహిస్తామని ...
Read More »విమానం నుంచి కిందపడి పోయిన ఎయిర్హోస్టెస్…..!
విమానం నుంచి కిందపడి పోయిన ఎయిర్హోస్టెస్…..! ఎయిరిండియా విమానానికి చెందిన ఎయిర్హోస్టెస్ ప్రమాదవశాత్తు కిందపడిపోయి తీవ్ర గాయాలపాలయ్యారు. ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం టేకాఫ్కు సిద్ధమవుతుండగా ఈ ఘటన జరిగింది. ఈరోజు అనగా సోమవారం ఉదయం ముంబయి నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన విమానంలో ప్రయాణికులంతా ఎక్కిన తర్వాత 53ఏళ్ల ఎయిర్హోస్టెస్ విమానం తలుపు మూయబోతుండగా ప్రమాదవశాత్తు విమానం నుంచి కింద పడిపోయారు. బోయింగ్-777 విమానం తలుపు మూస్తుండగా తమ సిబ్బందిలో ఒకరైన హర్షా లోబో దురదృష్టవశాత్తు కింద పడిపోయారని ఎయిరిండియా ...
Read More »మళ్ళి పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు…!
మళ్ళి పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు…! ఆయిల్ మార్కెట్ కంపెనీలు పెట్రోలు, డీజిల్ ధరలను మరోసారి సవరించాయి. దీంతో శనివారం (అక్టోబరు 13) కూడా దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 18 పైసలు పెరిగిన పెట్రోలు ధర రూ.82.66 కి చేరింది. డీజిల్ ధర 29 పైసలు పెరిగి రూ.75.19 కి చేరింది. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలోనూ 18 పైసలు పెరిగిన పెట్రోలు ధర రూ.87.94 కి చేరింది. డీజిల్ ధర 31 పైసలు పెరిగి రూ.78.82 కి చేరింది. కేంద్రం ప్రభుత్వం పెట్రో ధరలపై ...
Read More »వచ్చే 48 గంటల్లో గ్లోబల్ ఇంటర్నెట్ షట్ డౌన్ యూజర్లకు షాక్
వచ్చే 48 గంటల్లో ఇంటర్నెట్ యూజర్లు నెట్ వర్క్ వైఫల్యం ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. సర్వర్ మెయింటెనెన్స్ సందర్భంగా ఇంటర్నెట్ వినియోగదారులు నెట్ వర్క్ సమస్యను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యా టుడే రిపోర్ట్ మేరకు గ్లోబల్ ఇంటర్నెట్ యూజర్లు పలుచోట్ల నెట్ వర్క్ వైఫల్యం ఎదుర్కొనే అవకాశమున్నట్లు తెలుస్తుంది. ముఖ్యమైన డొమైన్ సర్వర్లు, దానికి సంబంధించిన నెట్ వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్టర్ కూడా కాసేపు డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రష్యా టుడే రిపోర్ట్ మేరకు గ్లోబల్ ఇంటర్నెట్ యూజర్లు పలుచోట్ల నెట్ వర్క్ ...
Read More »విశాఖలో ‘అరవింద సమేత’ థియేటర్స్ వద్ద ఫాన్స్ పొలిటికల్ వివాదాలు…!
విశాఖలో ‘అరవింద సమేత’ థియేటర్స్ వద్ద ఫాన్స్ వివాదాల ఉద్రిక్తత…! విశాఖ జిల్లా పాయకరావుపేటలో ‘అరవింద సమేత’ సినిమా ప్రదర్శితం అవుతున్న సాయిమహల్ థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాజకీయ వివాదాల కారణంగా ఈ గొడవ జరిగినట్లు సమాచారం. నందమూరి కల్చరల్ యూత్ అసోసియేషన్ మరియు బాలకృష్ణ ఫ్యాన్స్ గౌరవాధ్యక్షుడు చింతకాయల రాంబాబు, అధ్యక్షుడు విశ్వనాధుల శ్రీనుకు, అతడి వర్గీయులకు టిక్కెట్లు ఇవ్వక పోవడంతో గొడవ మొదలైంది. వారికి టిక్కెట్లు ఇవ్వొద్దని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే థియేటర్ యాజమాన్యానికి చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ...
Read More »